MP Dharmapuri Aravind : ఈటల గెలిస్తే దళిత బంధు సహా అన్ని హామీలూ అమలవుతాయి.. అర్వింద్
హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ దిగొస్తారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన కేసీఆర్ కారణంగానే దళిత బంధు ఆగిందని ఆరోపించారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే హుజూరాబాద్ లో మాత్రమే ఆగిన దళిత బంధును రాష్ట్రంలో మిగిలిన చోట్ల అమలు చేయొచ్చు కదా అని నిలదీశారు.