MLA Marri Rajasekhar Reddy Protest on GHMC | జీహెచ్ఎంసీ మీద కోపంతో ఎమ్మెల్యే నిరసన | ABP Desam

జీహెచ్ఎంసీ మీద కోపంతో ఓ ఎమ్మెల్యే కాలువలో కూర్చోవటం కలకలం రేపింది. మల్కాజిగిరి గౌతమ్ నగర్ డివిజన్ లో ఆరు నెలల క్రితం తవ్విన రోడ్డు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎన్ని చెప్పినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవటం లేదంటూ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలువలో కూర్చున్నారు. తన శ్రేణులతో కలిసి కాలువలో కూర్చుని మూడు గంటల పాటు నిరసన తెలిపిన ఎమ్మెల్యే...ప్రజాపాలన అందిస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్లు వచ్చినా సమస్యలపై అధికారులు స్పందించటం లేదని..కనీస ప్రోటోకాల్ కూడా పాటించలేదని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ మీద కోపంతో ఓ ఎమ్మెల్యే కాలువలో కూర్చోవటం కలకలం రేపింది. మల్కాజిగిరి గౌతమ్ నగర్ డివిజన్ లో ఆరు నెలల క్రితం తవ్విన రోడ్డు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎన్ని చెప్పినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవటం లేదంటూ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలువలో కూర్చున్నారు. తన శ్రేణులతో కలిసి కాలువలో కూర్చుని మూడు గంటల పాటు నిరసన తెలిపిన ఎమ్మెల్యే...ప్రజాపాలన అందిస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్లు వచ్చినా సమస్యలపై అధికారులు స్పందించటం లేదని..కనీస ప్రోటోకాల్ కూడా పాటించలేదని మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola