Telangana Congress: కాపలా కాస్తా అన్నాడు.. కాటేస్తున్నాడు.. సీఎంపై మధుయాష్కీ తీవ్ర ఆరోపణలు
ABP Desam
Updated at:
09 Aug 2021 10:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు అన్యాయం చేస్తున్నారని నిజామాబాద్ మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ వ్యాఖ్యానించారు. జనాన్ని దగా చేసే కార్యక్రమమే దళిత బంధు అని వ్యాఖ్యానించారు. గతంలో దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి ఇచ్చి ఉంటే అదే ఒక్కో ఎకరం రూ.10 లక్షలు అయ్యేదని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి ఖాళీలు భర్తీ చేసినా ఎంతో ఆదాయం వచ్చి ఉండేదని అభిప్రాయపడ్డారు. ఆదివారం ‘ఏబీపీ దేశం’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని వివరాలు వెల్లడించారు.