Choppadandi TSWR School : కరీంనగర్ లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థుల అస్వస్థత | ABP Desam

కరీంనగర్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చొప్పదండి లో,తెలంగాణా సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి 85 మంది అమ్మాయిలు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో క్యాబేజీ కర్రీ, గుడ్డు ,చారు, మజ్జిగ తిన్న తర్వాత కడుపు నొప్పి రావడంతో విద్యార్థినులు ఇబ్బందులు పడ్డారు. వెంటనే వారిని కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. 37 మంది విద్యార్థులు కోలుకున్నారు.మిగతా పిల్లలకు చికిత్స అందిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola