Voice Messages Of Secunderabad Incident: వాట్సాప్ వేదికగానే మొత్తం ప్రణాళిక జరిగినట్టు గుర్తింపు..!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్లకు వాట్సాప్ గ్రూపుల వేదికగా ప్లాన్ జరిగినట్టుగా తెలుస్తోంది. అరెస్ట్ చేసిన పలువురి సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆర్మీ స్టూడెంట్స్ పేరుతో పలు గ్రూపులను గుర్తించారు. జస్టిస్ ఫర్ ఆర్మీ CEE, హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్ పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. వాట్సాప్ గ్రూపుల ద్వారానే అల్లర్లకు ప్లాన్ వేసుకున్నట్టు తెలుస్తోంది. పెట్రోల్ బాటిల్స్, పాత దుస్తులు, టైర్లు తెచ్చుకోవాలని చెప్తున్నట్టుగా ఉన్న వాయిస్ మెసేజెస్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవేంటో మీరూ వినండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola