Revanth Reddy: తన ఇంటి వద్ద టీఆర్‌ఎస్‌ శ్రేణులు చేసిన హంగామాపై రేవంత్‌ ఫిర్యాదు..

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ముట్టడించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. మంగళవారం జరిగిన సంఘటనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ శ్రేణులపై కేసులు నమోదు చేయడంపై రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ శ్రేణులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేయడానికి వచ్చిన వారిని వదిలేసి తమ అనుచరులపై కేసులు పెట్టడమేంటని పోలీసులను ప్రశ్నించారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola