సంకీర్ణ ప్రభుత్వం దేశానికి మంచిదేనా? ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో రఘునందన్, మధుయాష్కి

సదర్న్ రైజింగ్ సమ్మిట్‌లో కాంగ్రెస్ నేత మధుయాష్కి, బీజేపీ రఘునందన్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ విషయంలో స్థానిక పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని రఘునందన్ రావు తేల్చి చెప్పారు. అదానీ, అంబానీలకు మాత్రమే మోదీ సర్కార్ దోచి పెడుతోందని మధుయాష్కి మండి పడ్డారు. శుక్రవారం 'బైపోలార్ లేదా మల్టీపోలార్ - ది పాలిటిక్స్ ఆఫ్ టుమారో' అనే సెషన్‌లో మెదక్ ఎంపీ, తెలంగాణ బీజేపీ కార్యదర్శి రఘునందన్ రావు మాధవనేని, కాంగ్రెస్ నేత మధుయాష్కి మాట్లాడారు. 2029 ఎన్నికల వరకు బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే మనుగడ సాగిస్తాయని పేర్కొన్నారు. "కేసీఆర్ తన పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చుకున్నారని అన్నారు. కానీ ప్రజలు వారికి సీఆర్ఎస్ (నిర్బంధ పదవీ విరమణ పథకం) ఇచ్చారని రఘునందన్ రావు అన్నారు. 2029 ఎన్నికల నాటికి  రెండు జాతీయ పార్టీలు మాత్రమే మనుగడలో ఉంటాయని రఘునందన్ రావు అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ నేత మధు గౌడ్ యాస్కీ బీజేపీ ఎంపీకి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో తన కుటుంబ పాలనను నెలకొల్పాలని కేసీఆర్ భావించారని.. తమ పార్టీ పేరు నుంచి తెలంగాణ అనే పదాన్ని కూడా తొలగించారని, ఇలాంటి నిరంకుశ పాలనను ప్రజలు కోరుకోవడం లేదని... వారికి ఉజ్వల భవిష్యత్తు కనిపించడం లేదని అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola