గచ్చిబౌలి గోపీచంద్ అకాడమీలో కిదాంబి శ్రీకాంత్ కు ఘనస్వాగతం

బీడబ్య్లూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో రజత పతకం గెలుచుకున్న తర్వాత హైదరాబాద్ కు చేరుకున్న స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కు ఘన స్వాగతం లభించింది. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శ్రీకాంత్ ను ఘనంగా సన్మానించారు కోచ్ గోపీచంద్. అకాడమీలోని చిన్నారులు, శ్రీకాంత్ తల్లితండ్రులు, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు శ్రీకాంత్. ఫైనల్ లో సింగపూర్ ఆటగాడు లోహ్ కీన్ యూ తో 15-21, 20-22 తేడాతో ఓటమిపాలైనా....ఫైనల్ వరకూ శ్రీకాంత్ చూపించిన పోరాట పటిమను ప్రశంసించారు గోపీచంద్. పురుషుల బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రజత పతకం గెలిచిన తొలి భారతీయుడిగా నిలవటం గర్వకారణమన్నారు. ఫైనల్ లో చేసిన తప్పిదాలపై పున: సమీక్ష చేసుకుంటాన్న కిదాంబి శ్రీకాంత్... రాబోయే మ్యాచుల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేసేలా కృషి చేస్తానన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola