Watch: శాసనమండలిలో కల్వకుంట్ల కవిత తొలి ప్రసంగం చూడండి
శాసన మండలిలో కల్వకుంట్ల కవిత తన తొలి ప్రసంగాన్ని చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి మాట్లాడిన కవిత.. కొత్తమండలాల్లో ఎంపీపీలకు సొంత కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక సంస్థల సంక్షేమం కోసం టీఆర్ఎస్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను ఈ సందర్భంగా కొనియాడారు.