Ganja Seized : భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో టైల్స్ లారీలో తరలిస్తున్న గంజాయి పట్టివేత | ABP Desam

ఎవరికీ అనుమానం రాకుండా టైల్స్‌ కింద కోటి అరవై లక్షల రూపాయల విలువైన గంజాయిని తరలిస్తున్న ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీసులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్ కి చెందిన దినేష్‌ అనే వ్యక్తి తన స్నేహితుడు సునీల్‌తో కలిసి గంజాయి వ్యాపారాన్ని నిర్వహించేందుకు సిద్దమయ్యాడు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ లోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఒక టైల్స్‌ ప్యాక్టరీలో టైల్స్‌ కొనుగోలు చేశారు. అక్కడ్నుంచి చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం కుంటకు చేరుకుని ఓ వ్యక్తి నుంచి 825 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. వీటి టైల్స్‌ కింద అమర్చి తెలంగాణలోని భద్రాచలం, హైదరాబాద్‌ మీదుగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చేరవేసేందుకు ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న చుంచుపల్లి పోలీసులు వాటిని పట్టుకున్నారు. ఈ కేసులో దినేష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola