అరాచకమే బీజేపీ లక్ష్యం.. వారికెవరైనా ఓటేస్తారా?: మాజీ ఎంపీ వినోద్
ABP Desam
Updated at:
28 Oct 2021 02:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదేశంలోనే అద్భుతంగా సంక్షేమ పాలన అందిస్తున్న టీఆర్ఎస్ కు ఓటెయ్యకుండా అరాచకాలు సృష్టించే బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేస్తారని మాజీ ఎంపీ వినోద్ అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన కేసీఆర్ సభను కేంద్రంలోని బీజేపీనే రద్దు చేయించిందని ఆరోపించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతుంటే బలగాలను ఎందుకు పంపించారని ప్రశ్నించారు. కేసీఆర్ అద్భుతంగా పాలిస్తున్నారని మోదీనే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. అభివృద్ధి కోరుకునే ప్రజలు టీఆర్ఎస్ నే గెలిపిస్తారని చెప్పారు.