అసెంబ్లీ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు
అసెంబ్లీ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్సీ కవిత, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తదితర మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి బతుకమ్మ ఆడి సంబురాలను జరిపారు.