Bail For Kothapalli Geeta : బ్యాంక్ రుణాల ఎగవేత కేసులో కొత్తపల్లి గీతకు ఊరట | ABP Desam
సీబీఐ కోర్టులో శిక్ష పడిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని గీత దంపతులను హైకోర్టు ఆదేశించింది. బ్యాంకును మోసం చేశారన్న కేసులో గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావుకు న్యాయస్థానం ఐదేళ్ల జైలుశిక్ష విధించింది.