ABP PV Sindhu Exclusive Interview: ఇది నాకూ..దేశానికీ చాలా గర్వకారణమైన విషయం
Continues below advertisement
టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతకం విజేత, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఏబీపీ దేశంలో మాట్లాడారు.
- రెండు ఒలంపిక్ మెడల్స్ సాధించడంపై మీ స్పందన ఏంటి..?
'ఇది నాకూ..దేశానికీ చాలా గర్వకారణమైన విషయం
ఇది అంత తేలికైన విషయం కాదు. పోటీ బాగా పెరిగింది. అంచనాలు ఎక్కువుగా ఉన్నాయి. - మీరు గెలుచుకున్న షటిల్ ఉంది.. ఎంత కష్టం అయింది గెలవడానికి ..?
గడచిన ఐదేళ్లుగా నేను తీవ్రంగా శ్రమిస్తున్నాను. కరోనా వల్ల ప్రాక్టీస్ చేయడానికి కూడా ఇబ్బంది ఎదురైంది. ఈ విషయంలో ప్రభుత్వం, బాడ్మింటన్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకరించాయి. - ప్రేక్షకులు లేకపోవడం లోటుగా ఫీలయ్యారా..?
కచ్చితంగా... పాండమిక్ కారణంగా ఈసారి ప్రేక్షకులు లేరు. కానీ పరోక్షంగా వాళ్లంతా నన్ను చూస్తున్నారని.. మద్దతు ఇస్తున్నారనీ నాకు తెలుసు. వారందరికీ కృతజ్ఞతలు - పారిస్ టోర్నమెంట్ ప్రణాళికలు.. అంచనాలు ఏంటి..
ప్రస్తుతం ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నాను. పారిస్ కోసం సిద్ధమవుతున్నా.. నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తా - సెమిస్ లో ప్రవేశించిన మన హాకీ జట్లకు ఏం మెసేజ్ ఇస్తారు..
రెండు జట్లనూ నేను అభినందిస్తున్నాను. వాళ్లకి ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా అమ్మాయిల జట్టు ఆస్ట్రేలియాతో అదరగొట్టింది.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement