Punjab Kings vs Chennai Super Kings Highlights | మూడు రోజుల్లోనే లెక్క సరిచేసిన చెన్నై | ABP Desam
ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై తిరిగి కమ్బ్యాక్ ఇచ్చింది. మూడు రోజుల క్రితం పంజాబ్ చేతిలో ఓడిన చెన్నై ఇప్పుడు పంజాబ్ పైనే విజయం సాధించింది. శనివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను చెన్నై 28 పరుగులతో ఓడించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. పంజాబ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 139 పరుగులకు పరిమితం అయింది.