IPL2022 : MI Captain Rohit Sharma 64 runs away to achieve record| ABP Desam
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్లో హిట్మ్యాన్ మరో 64 పరుగులు సాధిస్తే టీ20ల్లో 10000 పరుగుల మార్కును అందుకుంటాడు. గతంలో టీమిండియా నుంచి విరాట్ కోహ్లి, ఓవరాల్గా మరో ఐదుగురు మాత్రమే ఈ అరుదైన మైలురాయిని అధిగమించగలిగారు.