1000వ ఓడీఐలో విండీస్ పై గెలుపొందిన భారత్
South Africaలో వైట్ వాష్ ప్రభావం తర్వాత ఆడిన తొలి ODIలో భారత్ పుంజుకుంది. వెస్ట్ ఇండీస్ తో three match seriesలో భాగంగా అహ్మదాబాద్ లో జరిగిన తొలి మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట చాహల్, వాషింగ్టన్ సుందర్ స్పిన్ ద్వయం విజృంభించడంతో విండీస్ 176 పరుగులకే చాప చుట్టేసింది. స్వల్ప లక్ష్య ఛేదనకి దిగిన ఇండియా సునాయాసంగా గెలిచింది. ఫుల్ టైం క్యాప్టెన్ గా రోహిత్ 60 పరుగులతో రాణించాడు. సూర్య కుమార్, దీపక్ హూదా, ఇషాన్ కిషన్, రోహిత్ కు తోడ్పాటు అందించారు. దీంతో 28 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని చేరుకుని 1000వ ఓడీఐలో గెలుపొందింది.
Tags :
Cricket India Indian Cricket West Indies IND Vs WI Rohit Sharma As Captain 1000 Odi Of India Indian Mens Cricket