India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం

Continues below advertisement

టీమిండియా ఫీల్డింగ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత టీ దిలీప్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా తన ప్రయాణం ముగిసిందని, ఈ ఐదేళ్లు తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోతాయని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

2021లో ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన దిలీప్, డ్రెస్సింగ్ రూమ్‌లో ‘బెస్ట్ ఫీల్డర్ మెడల్’ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టి ప్లేయర్స్ ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల జరిగిన ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్‌లలో టీమిండియా ఫీల్డింగ్ బాగాలేకపోవడం, ఓటములు ఎదురవ్వడంతో బీసీసీఐ అతని కాంట్రాక్ట్‌ను పొడిగించలేదు. అతని స్థానంలో శుభ‌దీప్ ఘోష్ నూతన ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. 

ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిన దిలీప్, తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐతో పాటు హెడ్ కోచ్‌లు రాహుల్ ద్రవిడ్, గౌతమ్ గంభీర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. తన హయాంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్ వంటి దిగ్గజ కెప్టెన్లతో కలిసి పనిచేయడం దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola