Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ

ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో గిల్ సేన విజయం సాధించింది. ఈ ఉత్కంఠభరిత విజయం అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసే ఆఖరి బంతికి ముందు బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణతో జరిగిన చర్చను గిల్ గుర్తు చేసుకున్నాడు. "చివరి బంతికి యార్కర్ వేయాలా లేక స్లోయర్ వేయాలా అని చర్చించుకున్నాం. పిచ్ స్లోగా ఉండటంతో, స్లోయర్ బాల్ అయితే బ్యాటర్ బౌండరీ కొట్టడం కష్టమని నిర్ణయించుకున్నాం. ఆ ప్లాన్ వర్కౌట్ అయ్యి మాకు విజయాన్ని అందించింది" అని గిల్ వివరించాడు.

ఢిల్లీ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఐదో బంతికి సింగిల్ తీసుకోకపోవడం తమకు కలిసొచ్చిందని గిల్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ మిల్లర్ సింగిల్ తీసుంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నాడు. అలాగే తన ఫీల్డింగ్‌లో జరిగిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల వచ్చిన 5-6 పరుగుల గురించి ఆత్మవిమర్శ చేసుకున్నాడు. ఇలాంటి క్లోజ్ మ్యాచ్‌ల్లో ప్రతి పరుగు విలువైనదేనని గిల్ పేర్కొన్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola