Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ చోటుచేసుకుంది. చివరి బంతి వరకు ఎవరు విజయం సాధిస్తారో తెలియని పరిస్థితి. అలాంటి టైం లో గుజరాత్ టైటాన్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత విజయం సాధించి ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ బ్యాట్సమన్ అందరు బాగా ప్రదర్శించారు. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు మంచి ఆరంభాని అందించారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ కేఎల్ రాహుల్ మొండిగా పోరాడాడు. 

అయితే మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పింది లాస్ట్ ఓవర్. ఢిల్లీ గెలుస్తుంది అని అందరు భావించారు. కానీ అలా మాత్రం జరగలేదు. చివరి ఓవర్ లాస్ట్ రెండు బంతుల్లో 2 పరుగులు కావాలి. ఒక పరుగు కూడా రాలేదు. అంతే! గుజరాత్ టైటాన్స్ ఒక్క పరుగు తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola