Why India Lost Series Against Srilanka After 27 Years| స్పిన్ ఆడటం భారత బ్యాటర్లు మరచిపోయారా..? | ABP Desam

India vs Sri Lanka 3rd ODI Match Highlights | 

 1997 తరువాత తొలిసారిగా శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోవడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటంటే..! 

నెం-1 బ్యాటింగ్ ఫెయిల్యూర్..!  3 మ్యాచుల్లో రోహిత్ శర్మ ఒక్కడే కాస్త బాగా ఆడాడు.ఫస్ట్ వన్డేలో 58, సెకండ్ వన్డేలే 64, మూడో వన్డేలో35 పరుగులతో టీం ఇండియా తరపున మనోడే టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లు అంతా చేతులెత్తేశారు మరి ముఖ్యంగా వన్డేల్లో నిలకడగా ఆడే విరాట్ కోహ్లీ మూడు మ్యాచుల్లో కలిపి 58 పరుగులే కొట్టాడు. శుభ్ మన్ గిల్,శివమ్ దూబే, శ్రేయస్ అయ్యర్, కేఏల్ రాహుల్ వంటి వాళ్లు కనీస స్థాయిలో కూడా ఆడలేదు. దీని వల్లే లంక పై ప్రెజర్ పెంచలేకపోయాం. 

నెం-2 : బౌలింగ్..! లంక పిచ్ లు స్పిన్నర్లకు అనూకులంగా ఉంటాయి. కానీ, మన రెగ్యూలర్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లు కలిసి మూడు మ్యాచుల్లో సుమారు 10 వికెట్లు మాత్రమే పడగొట్టారు. సిరాజ్ మినహా మంచి వన్డే బౌలర్ టీమ్ లో లేడు. శ్రీలంకపై వికెట్ల వరద పారిస్తాడు అనుకుంటే మనోడు తేలిపోయాడు. 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola