Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam

Continues below advertisement

13 ఏళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా, ఈసారి పసుపు జెర్సీని వదిలి రాజస్థాన్ రాయల్స్ పింక్ జెర్సీలో మెరిశాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ తరపున కీలక వికెట్లను పడగొట్టాడు. అయితే మ్యాచ్ తర్వాత ధోనీ గురించి జడేజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"సీఎస్కే నుండి వెళ్ళిపోయాక ధోనీతో మాట్లాడారా?" అని అడిగిన ప్రశ్నకు జడ్డూ నవ్వుతూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. "మహేంద్ర సింగ్ ధోనీ ఫోన్ ఎప్పుడూ స్విచ్ఛాఫ్ ఉంటుంది, అందుకే మాట్లాడలేదు" అని వ్యాఖ్యానించాడు. అయితే ఫోన్లో టచ్‌లో లేకపోయినా, బయట కలిసినప్పుడు మాత్రం అన్ని విషయాలు చర్చించుకుంటామని క్లారిటీ ఇచ్చాడు.

ఇక రాజస్థాన్ జెర్సీ గురించి చెప్తూ.. "పింక్ కలర్ నాకు బాగానే సెట్ అయ్యింది" అని అన్నాడు. ఐపీఎల్ 2024లో చెన్నైకి టైటిల్ అందించిన జడేజా, ఇప్పుడు రాజస్థాన్ తరపున సత్తా చాటడం విశేషం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola