Ind vs Ban T20 WC 2022 Highlights: ఈసారి వరుణుడు మనకు హ్యాండ్ ఇవ్వలేదు.. హెల్ప్ చేశాడు | ABP Desam
టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151 పరుగులకు కుదించారు. అయితే బంగ్లాదేశ్ ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా ఐదు పరుగులతో విజయం సాధించింది. ఈ విజయంతో తిరిగి భారత్ టేబుల్ టాపర్గా నిలిచింది. అర్థ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.