Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్పై బిసిసిఐ వేటు
ఇండియన్ క్రికెట్ టీమ్లో ప్రస్తుతం భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్ ఇప్పటికే టీమిండియా సపోర్ట్ స్టాఫ్ నుంచి తప్పుకున్నారు. రీసెంట్ గా హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి లాంటి యంగ్ ప్లేయర్లు వరుసగా గాయపడటంతో టీమ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్పై బిసిసిఐ ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్లలో పరాజయాల తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ సపోర్ట్ స్టాఫ్ పర్ఫార్మన్స్ పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2022 నుంచి హెడ్ ఫిజియోగా బాధ్యతలు చూస్తున్న కమలేష్ జైన్ పనితీరు ఇప్పుడు స్కానర్లో ఉంది. ప్లేయర్లను 100% ఫిట్నెస్ సాధించకుండానే హడావుడిగా మైదానంలోకి దించుతున్నారా అనే కోణంలో బిసిసిఐ విచారణ జరుపుతోంది.
మరోవైపు కాంట్రాక్ట్ ముగియడంతో ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. శ్రీలంకతో జరగబోయే కీలకమైన రెండు టెస్టుల సిరీస్ కోసం కొత్త ఫీల్డింగ్ కోచ్ శుభదీప్ ఘోష్ జట్టుతో కలిసి ప్రయాణించనున్నారు.