Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

Continues below advertisement

టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘోర పరాజయం పాలుకావడంతో అభిమానులు గంభీర్‌ను టార్గెట్ చేశారు. వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోకుండా, బెంచ్‌కే పరిమితం చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ వివాదంపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. గంభీర్ తీసుకున్న నిర్ణయానికి అండగా నిలిచాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీతో డ్రింక్స్ మోయించడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశాడు.

"సంజూ శాంసన్, అభిషేక్ శర్మల ఓపెనింగ్ జోడీ ప్రస్తుతం జట్టుకు చాలా ముఖ్యం. ప్రపంచకప్‌లో సంజూ బాగా రాణించాడు. ఒక్క మ్యాచ్‌లోనే విఫలమయ్యాడని అతన్ని పక్కనపెడితే టీమ్ కాంబినేషన్ దెబ్బతింటుంది. వైభవ్ వయసు చిన్నది. వాటర్ బాయ్‌గా ఉంటూ మ్యాచ్‌ను గమనించడం వల్ల అతను చాలా విషయాలు నేర్చుకుంటాడు. సహనంతో నిరీక్షించడం యువ ఆటగాళ్లను మానసికంగా మరింత బలోపేతం చేస్తుంది" అని అశ్విన్ వివరించాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola