AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

Continues below advertisement

ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ చేసిన బ్లండర్ మిస్టేక్స్‌పై ఆర్సీబీ లెజెండ్ ఏబీ డివిలియర్స్ చేసిన సంచలన విమర్శలు చేసారు. ఆర్సీబీ చేతిలో జీటీ దారుణంగా ఓడిపోవడానికి కోచ్ ఆశిష్ నెహ్రా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీసుకున్న ఒక దారుణమైన నిర్ణయమే కారణమా? అంటే అవుననే అంటున్నాడు డివిలియర్స్. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ మేనేజ్‌మెంట్ భయపడుతూ డిఫెన్సివ్ క్రికెట్ ఆడిందని, అందుకే ఆర్సీబీ ఈజీగా కప్పు కొట్టేసిందని డివిలియర్స్ అన్నాడు. 

అసలేం జరిగిందంటే.. ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు మూడో ఓవర్లోనే గిల్ ఔట్ అయి గట్టి షాక్ తగిలింది. ఆ టైమ్‌లో స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ క్రీజులోకి రావాలి. కానీ గుజరాత్ నిశాంత్ సింధును వన్ డౌన్‌లో పంపింది. దీనిపై ఏబీ డివిలియర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

"బట్లర్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్‌ను పవర్ ప్లేలో రిస్క్ చేయడం ఇష్టం లేక వెనక్కి దాచడం పూర్తిగా తప్పుడు నిర్ణయం. ఐపీఎల్ లాంటి పెద్ద ఫైనల్ మ్యాచ్‌లో ఇలా భయపడుతూ ఆడే మైండ్ సెట్ నాకు అస్సలు నచ్చలేదు" అని ఓపెన్‌గా విమర్శించాడు. డివిలియర్స్ అన్నట్టే.. జీటీ భయపడి ఆడి పవర్ ప్లేలోనే కుప్పకూలింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ 50 రన్స్ కొట్టడంతో గుజరాత్ 155 రన్స్ చేయగలిగింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola