Israel attack in Beirut | హిజ్బుల్లా కీలకనేత సైఫుద్దీన్ చంపేసింది ఇక్కడే | ABP Desam

లెబనాన్‌లోని బీరూట్‌లో హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులకు దిగింది. బీరుట్ లోని ఎయిర్ పోర్ట్ సమీపంలో జరిగిన క్షిపణి దాడుల్లో అక్కడ భవనాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ఏబీపీ న్యూస్ రిపోర్టర్ జగ్యిందర్ పటియాల్ గ్రౌండ్ జీరోకు వెళ్లి సంచలన విజువల్స్ ఏబీపీ న్యూస్ కు అందించారు. సెప్టెంబర్ లో ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హషీమ్ నస్రల్లా మరణించగా నిన్న ఆయన సోదరుడు హషీమ్ సైఫిద్దీన్ సైతం బీరుట్ లో జరిగిన దాడుల్లో  మరణించినట్లు సమాచారం.  సైఫుద్దీన్ మరణించిన ప్రాంతం ఇదే. ఈ బిల్డింగ్ మీదకు డ్రోన్ల్లను ప్రవేశపెట్టిన ఇజ్రాయెల్ సైన్యం..డ్రోన్ ద్వారా బాంబులు విసిరి సైఫుద్దీన్ ప్రాణాలు తీసింది.  అంతే కాదు దాదాపు 30-40 క్షిపణి దాడులతో ఈ ప్రాంతంలో కనిపిస్తున్న భవనాలు ఇదిగో ఇలా పూర్తిగా నేలమట్టం అయ్యాయి. బాంబుల మోత మధ్య యుద్ధభూమిలో విజువల్స్ ను ఏబీపీ న్యూస్ ప్రేక్షకుల కోసం గ్రౌండ్ జీరో నుంచి అందిస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola