ఉరేసుకుంటున్నా అంటూ ఆఖరి సారి తల్లికి ఫోన్ చేసి నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
ABP Desam
Updated at:
08 Jan 2022 05:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవరంగల్ లోని ఓ హాస్టల్ లో ఉరేసుకుని నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న హాస్టల్ యాజమాన్యం విద్యార్థినిని నగరంలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ కు చేరుకున్న సుబేదారి పోలీసులు, స్పెషల్ పార్టీ బలగాలు విద్యార్థినిని చూసేందుకు యత్నించగా... హాస్పిటల్ యాజమాన్యం వెళ్లనివ్వలేదు. ఐసీయూలో ఉంచామని.. ఎవ్వర్ని రానివ్వమని అడ్డుకున్నారు. ఈ మేరకు ఆ అమ్మాయి ఆత్మహత్యాయత్నంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్ లోనే ఏమో జరిగిందంటూ కుటుంబసభ్యులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు.