Warangal Cotton Market: వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో అత్యధిక ధర నమోదు చేసిన పత్తి
వరంగ్ ఎనుమాముల మార్కెట్ లో పత్తికి రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ పత్తి నిన్నటివరకూ రూ.6025 రూపాయలు ఉండగా....ఈరోజు రూ.9570 గా నమోదైంది. ధర పెరిగినా కానీ రైతులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి తగ్గటంతో పాటు పెట్టుబడి ధరలు అధికంగా పెరిగాయని....కూలిరేట్లు, రసాయన మందుల రేట్లు, విత్తనాల రేట్లు పెరగటంతో రైతుకు నష్టమే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.