Breaking News| Vizag JAC |3 రాజధానులకు మద్దతుగా రాజీనామాలకు సైతం సిద్ధమంటున్న వైసీపీ నేతలు |ABP

వికేంద్రీకరణకు మద్దతుగా అవసరమైనతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. విశాఖలో ఏర్పాటు చేసిన నాన్ పొలిటకల్ JAC కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..విశాఖకు రాజధాని వస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఐతే.. ఏకంగా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ సిద్ధం చేశారు. JAC నాయకులకు ఈ లేఖను అందించారు.ఐతే.. ముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని ధర్మశ్రీ డిమాండ్ చేశారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola