Venkat Ramireddy: కొత్త జీతాలు వెంటనే ప్రాసెస్ చేయాలని డిమాండ్
కొత్త జీతాలు వెంటనే ప్రాసెస్ చేయకపోతే క్రమశిక్షణా చర్యలు ఉంటాయంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనలపై ఏపీ సచివాలయ ఉద్యోగ సమాఖ్య అధ్యక్షుడు వెంకట్ రామిరెడ్డి స్పందించారు. ఒక్క ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా వెంటనే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. న్యాయపరంగా సంప్రదించి వెంటనే సమ్మెపై ఆలోచన చేస్తామని వెంకట్ రామిరెడ్డి అన్నారు.