TTD Dharma Reddy: కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ ఉంటేనే తిరుమల దర్శనానికి అనుమతి
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలను ఈసారీ పదిరోజుల పాటు కల్పించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన....జనవరి 1 నుంచి 13వరకూ ఇప్పటికే టికెట్లను విడుదల చేశామన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరన్న తితిదే అడిషనల్ ఈవో....కోవిడ్ లక్షణాలున్న వారు తిరుమలకు రావద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.