Tribals Bandh: పోలవరం పరిహారం చెల్లించాలి, జీవో నెం.3 ని చట్టబద్ధం చేయాలని డిమాండ్..

Continues below advertisement

తూర్పు గోదావరి జిల్లా ఏజన్సీలో మన్యం బంద్ కొనసాగుతోంది. గిరిజన సంఘం, ఆదివాసీ మాతృభాష సంఘం, ఎస్సెఫై ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. పోలవరం పరిహారం చెల్లించాలి, జీవో నెం.3 ని చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేస్తూ, అటవీ హక్కు చట్ట సవరణ వ్యతిరేకిస్తూ, విద్యార్థులకు స్కాలర్షిప్, మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేసారు గిరిజన సంఘాలు. అటు విశాఖ ఏజెన్సీ పాడేరు లో మన్యం బంద్ కొనసాగింది. పోలీసులు 40 మంది ఉద్యమ కారులను పాడేరు హుకుంపేట పోలీసుస్టేషన్ లకు అరెస్ట్ చేసి తరలించారు.గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు  అప్పలనర్సాబాషా వలింటర్ల సంఘ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు,ఎక్కడికక్కడ బంద్ ను అడ్డుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram