Today's Episode: పోలీస్ స్టేషన్ లోనే జానకి... అనాథాశ్రమానికి చేరుకున్న శారదాంబదేవి
ABP Desam
Updated at:
12 Jan 2022 05:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసౌందర్య దంపతులు తాడికొండలోని ప్రకృతి ఆశ్రమానికి చేరుకుంటారు. వాళ్లని ఫాలో అవుతూ మోనిత కూడా చేరుకుని సౌందర్య వాళ్లని వెతుకుతుంది. సరిగ్గా అప్పుడే దీప కూడా బాబుని తీసుకుని అక్కడకు వెళ్తుంది. తర్వాత చిట్టి వ్యాపారి దగ్గరకు వెళ్లి తాను చిట్టి కడతానని... కానీ ముందుగా తనకు రూ. 3 లక్షలు ఇవ్వమని అడుగుతుంది. తనమీద నాకు నమ్మకం లేదని చెప్తుంది. ఇటు మోనిత... కార్తీక్ పనిచేసే హోటల్ కి వెళ్తుంది. అప్పటి వరకు కార్తీక్ నే ఆర్డర్లన్నీ తీసుకోమన్న ఇంకో పనోడు... మోనితను చూసి తానే వెళ్తాడు. మోనిత గొంతు విన్న కార్తీక్.. డౌట్ గా ముందుకొచ్చి చూడగా అదే టైంకి అటువైపు చూసిన మోనిత కూడా షాక్ అవుతుంది. వారిద్దరూ ఒకర్నొకరు చూసుకున్నారా అనే డౌట్ తో ఇవాళ్టి కార్తీకదీపం అయిపోతుంది.