Tirumala : శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

Tirumala శ్రీవారిని భారత Vice President Venkayya Naidu దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.. వెంకయ్య నాయుడుతో పాటుగా ఆయన సతీమణి ఉషా,కుటుంబ సభ్యులు స్వామి వారి సేవలో మొక్కులు చెల్లించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ, కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వామి దర్శనంతో లభించిన సంతృప్తి, సంతోషంతో ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం లభిస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola