Tejaswi Yadav Met KCR : ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన బిహార్ ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్
ఆర్జేడీ నేత, బిహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. మంగళవారం ప్రగతి భవన్లో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ భేటీలో జాతీయ రాజకీయాలు, రాష్ట్రంలో అమలవుతున్నపథకాల గురించి ప్రధానంగా చర్చించినట్లుగా సమాచారం. ఈ భేటీలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , రాష్ట్ర మంత్రి కే తారక రామారావు, ఆర్జేడీ నుంచి మాజీ మంత్రి అబ్దుల్ భారీ సిద్దిఖీ తదితరులు పాల్గొన్నారు.