PeddaBompallI : కర్నూలు జిల్లాలో పెద్దబొంపల్లిలో ఇరువర్గాల మధ్య కొట్లాట| ABP Desam

కర్నూలు జిల్లా కోసిగి మండలం పెద్ద బొంపల్లిలో అంజనేయస్వామి రథోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన టిడిపి ఇంచార్జీ తిక్కరెడ్డిని వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వర్గీయులు అడ్డుకోవటంతో గ్రామంలో ఘర్షణ చెలరేగింది. టీడీపీ, వైసీపీ వర్గీయులు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో సుమారు ఆరుగురికి తలలపై తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స ఆసుపత్రికి తరలించారు. మా గ్రామానికి టీడీపీ ఇంచార్జీ తిక్కరెడ్డి రాకూడదని వైసీపీ వర్గీయులు అడ్డుకొని కర్రలతో దాడులు పాల్పడ్డారు. పెద్ద బొంపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొనటంతో... గ్రామంలో పోలీసు బలగాలను మొహరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola