SP Vishal Gunny : సామూహిక అత్యాచార కేసును ఛేదించిన పోలీసులు

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు వద్ద జంటపై సామూహిక అత్యాచార కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తు వివరాలను గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన 8 మంది సభ్యుల ముఠా ఈ దారుణానికి పాల్పడ్డట్టు తెలిపారు. ఆరుగురిని అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామన్నారు. నిందితులు 2-3 రోజులు ముందుగానే రెక్కీ నిర్వహించి... దారి దోపిడీలు, సామూహిక అత్యాచారాలకు పాల్పడతారని ఎస్పీ వివరించారు. పగలు కూలీ పనులు చేసుకుని రాత్రి పూట నేరాలకు పాల్పడతారన్నారు. మొబైల్స్, ద్విచక్రవాహనాలు అస్సలు వాడరన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola