Sankranthi: నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కానీ రాబడి మాత్రం పెరగటం లేదంటున్న సామాన్యుడు
అసలే కరోనా కాలం..ఇప్పటికే నిత్యావసర వస్తువుల దరలన్నీ పెరిగాయి..ఇప్పుడు ఆర్టీసీ చార్జీలు కూడ పెరిగితే భరించటం కష్టంగా ఉందని సామాన్యులు అంటున్నారు.కరోనాతో పండుగలకు వచ్చే వారి సంఖ్య కూడ తగ్గిందని,కుటుంబాలు వేర్వేరుగానే పండుగలు జరుపుకోవాల్సి వస్తుందని అంటున్నారు.ఆర్టీసీ తో పాటుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు చార్జీలు భారీగా పెంచాయి.పండుగ సందడితో పాటుగా రెండున్నర సంవత్సరాలు గా గిరాకీ లేక అవస్దలు పడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఇదే అదునుగా భావించి చార్జీలను పెంచేశాయి.హైదరాబాద్ నుండి విజయవాడ, విశాఖకు వెళ్ళే ప్రయాణీకులు జేబులు గుల్ల అవుతున్నాయి.