Rishabh Pant: ఆసియా అవతల అదిరిపోయే రికార్డు నెలకొల్పిన రిషభ్ పంత్

Ind vs SA, Rishabh pant century: టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. ఆసియా ఆవల మూడు సెంచరీలు చేసిన ఏకైక భారత వికెట్‌కీపర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు రెండో ఇన్నింగ్సులో అతడు శతకం బాదేశాడు. కేప్‌టౌన్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 139 బంతుల్లో 6 బౌండరీలు, 4 సిక్సర్లతో 100 పరుగులతో రిషభ్ పంత్‌ అజేయంగా నిలిచాడు. ఇందుకోసం అతడు 236 నిమిషాలు క్రీజులో ఉన్నాడు. ఎంతో విలువైన, చక్కని షాట్లను ఆడాడు. టీమ్‌ఇండియా ఈ ఇన్నింగ్సులో 198 పరుగులు చేస్తే అందులో అతడివే సగం కావడం ప్రత్యేకం. ఇక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో కలిసి ఐదో వికెట్‌కు 179 బంతుల్లో 94 పరుగుల భాగస్వామ్యం అందించాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola