Ring Nets Issue: రాస్తారోకో చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విశాఖ మత్స్యకారులు
ABP Desam
Updated at:
05 Jan 2022 10:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిశాఖలో రింగువలల వివాదం మరింత సున్నితంగా మారుతోంది. రింగు వలల వాడకం విషయంలో రెండు గ్రామాల మధ్య మొదలైన వివాదం ఇప్పుడు మత్స్యకారులు వర్సెస్ పోలీసులుగా మారుతోంది. అన్యాయంగా అరెస్ట్ చేసిన మత్స్యకారులను విడిచి పెట్టాలంటూ రాస్తారోకో నిర్వహిస్తూ ఆందోళన మొదలైంది. కలెక్టరేట్ కు వెళ్లేందుకు మత్స్యకారులు సిద్ధమవగా...పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో రోడ్డుపైనే బైఠాయించిన మత్స్యకారులు ఆందోళనను నిర్వహిస్తున్నారు.