Rameshbabu: కొవిడ్ నిబంధనలకు కట్టుబడి మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు| ABP Desam
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు శనివారం రాత్రి కాలేయ సంబంధిత వ్యాధితో మరణించారు. అయితే ఆదివారం ఉదయం 11 గంటలకు అతని పార్థివ దేహాన్ని పద్మాలయా స్టూడియోస్ లో ఉంచనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఒమిక్రాన్, కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్ నిబంధనలకు కట్టుబడి.. దహన సంస్కారాల స్థలంలో గుమిగూడకుండా ఉండాలని ఘట్టమనేని కుటుంబసభ్యులు తెలిపారు