Raghu veera Reddy: అనంతపురం జిల్లా హిందూపురంలో రఘువీరారెడ్డి పర్యటన
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి రఘువీరా రెడ్డి పర్యటించారు. తొలుత చిలమత్తూరులో వైసీపీ నేతలను కలిసిన రఘువీరా...అనంతరం హిందూపురంలో టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. రాజకీయాలపైనా చర్చించిన రఘువీరా....ఒకే నియోజకవర్గంలో ఇరు పార్టీల నేతలను కలవటంపై చర్చనీయాంశంగా మారింది.