PRC Steering Committee: ప్రభుత్వానికి తేల్చిచెప్పిన ఉద్యోగ నాయకులు
PRC GOలను రద్దు చేసేవరకు చర్చలకు వెళ్లకూడదని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. ఉద్యమ కార్యాచరణపై భేటీ అయిన ఉద్యోగ సంఘాల నాయకులు పలు విషయాలపై చర్చించారు. మంత్రుల కమిటీ ఆహ్వానం మేరకు వారితో భేటీ అయి లేఖ అందజేసిన అనంతరం స్టీరింగ్ కమిటీ నాయకులు మీడియాతో మాట్లాడారు. చర్చల ప్రక్రియ ఇవాళ జరగలేదని, తమ తదుపరి కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.