Hyderabad:డ్రగ్స్ సమస్య తక్కువ.. స్టూడెంట్స్ తీసుకోరని నమ్ముతున్నా-సీపీ అంజనీ కుమార్

హైదరాబాద్ ఉస్మానియా యునివర్సిటీలో డ్రగ్ ఎవేర్ నెస్ కాంపెయిన్ ను పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆరంభించారు. యువతతోపాటు మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంతో యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మిగిలిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో డ్రగ్స్ సమస్య తక్కువ. నిజమైన భారతీయ యువత డ్రగ్స్ జోలికి వెళ్లకూడదు. వాటి ఉచ్చులో పడబోకండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత ఉత్సాహం చూస్తుంటే వాళ్లెవరూ డ్రగ్స్ తీసుకోరని నేను నమ్మతున్నా. ఎవరైనా తీసుకున్నట్లు తెలిసినా వారికీ అవగాహన కల్పించండి. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ, అంబర్ పేట్, ఉప్పల్ ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola