Kadapa: ఆ గ్రామాలకు రహదారిలేదు..నదిలోనే అగచాట్లు
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణ సమీపంలోని పెన్నా వంతెన నదిలోకి క్రుంగిపోవడంతో దాదాపు 16 గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెన్నా నదికి భారీగా వరద రావడంతో ఇటీవల వంతెన కుంగిపోయింది. దీంతో అధికారులు నవంబర్ 22 వ తేదీ నుంచి వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ముద్దనూరు తోపాటు పులివెందుల, తాడిపత్రి, అనంతపురం వైపు వెళ్లేందుకు ఇది ప్రధాన రహదారి కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.