Nirmala SitaRaman : ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారింది | ABP Desam
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ... ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారిందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి.. తెలంగాణ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. కేంద్రం ఇస్తున్న పథకాలకే పేర్లు మార్చి.. రాష్ట్రంలో అమలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సర్కారు బయట తీసుకునే అప్పులు అసెంబ్లీకి తెలియడం లేదని నిర్మలాసీతారామన్ తెలిపారు.