Nellore:స్టీరింగ్ కమిటీ నాయకులకు వ్యతిరేకంగా న్యాయ శాఖ ఉద్యోగి కలెక్టరేట్ వద్ద నిరసన
ABP Desam
Updated at:
07 Feb 2022 05:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPRC సమస్యపై ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని నెల్లూరులో న్యాయ శాఖ ఉద్యోగి సురేష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని Collector Office ఎదుట బైఠాయించి ఆయన నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి జరిగిన చర్చలంతా నాటకమని విమర్శించారు. ఫిట్మెంట్, DA, అరియర్స్ పెరగలేదని, HRA రెండు శాతమే పెరిగిందని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ,CPS రద్దు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కారం కాకుండానే చర్చలు సఫలమని JAC ప్రకటించడం తగదన్నారు. 13లక్షల మంది ఉద్యోగులు అసంతృప్తితోనే వున్నారని, ప్రభుత్వం దీన్ని గుర్తించి న్యాయబద్ధంగా PRC ప్రకటించాలని డిమాండ్ చేశారు.