Narotham Mishra: సన్నీ లియోన్ కొత్తపాటపై మధ్యప్రదేశ్ హోంమంత్రి ఫైర్
సన్నీ లియోన్ కొత్త వీడియో ఆల్బమ్ సాంగ్ 'మధుబన్ మే రాధిక నాచే' వివాదంలో చిక్కుకుంది. రాధాకృష్ణుల ప్రణయానికి గుర్తైన పాటను కించపరిచేలా ఐటమ్ సాంగ్ లా వాడారని...తద్వారా హిందువుల మనోభావాలను కించపరిచారని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు మూడు రోజుల్లో పాటను తొలగించటమే కాకుండా....సన్నీలియోన్, రూపకర్తలు క్షమాపణలు చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు.