MP Rammohan Naidu: రెవెన్యూ జనరేట్ చేయటం చేతకాక పేదలపై పన్నులా..?
చెత్తపన్నుపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చెత్తపై పన్నులు వేయడేమిటన్న రామ్మోహన్ నాయుడు....మంత్రి ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావుల వ్యాఖ్యలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. పాలన చేతకాదు సమస్యలున్నాయని ఒప్పుకుంటున్నారా అని ప్రశ్నించిన శ్రీకాకుళం ఎంపీ..రెవెన్యూ జనరేట్ చేయటం రాక...పేదలపై పన్నుల భారాన్ని మోపుతున్నారన్నారు.